చిరు పార్టీ లక్షణాలే జగన్ పార్టీలో: హరిరామజోగయ్య
ప్రజారాజ్యం పార్టీలో ఉన్న అవలక్షణాలే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఆ పార్టీలో తాను ఉన్న అనుభవరీత్యా ఈ విషయాన్ని చెబుతున్నానని తెలిపారు. అప్పట్లో చిరంజీవి వచ్చి అంతా చూసుకుంటారని, ప్రజలు ఓట్లు వేసేస్తారన్న ఉద్దేశంతో నాయకులు ఉండడం వల్లే ప్రజారాజ్యానికి రాష్ట్రంలో పరాభవం ఎదురైందన్నారు. అదే ఉద్దేశంతో ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉండడం మంచిది కాదన్నారు.
జగన్ వచ్చి ఏదో చేసేస్తారని భావించడం తగదని స్పష్టం చేశారు. జగన్ బయట ఉన్నప్పుడు ప్రజల్లో ఉంటూ నిత్యం పార్టీ కోసం శ్రమించిన మాదిరిగానే నాయకులు కూడా ప్రజల మధ్య ఉండాలని సూచించారు. అప్పుడే పార్టీ బలోపేతమై జగన్ ముఖ్యమంత్రి అవుతారన్నారు.రానున్న సహకార ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేలా జిల్లాలోని యువనాయకులంతా కృషి చేయాలని సూచించారు.
వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసేందుకు అంతా ఐక్యంగా కృషి చేయాలని హితవు పలికారు. సమావేశానికి జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే బాలరాజుతో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఆళ్లనాని, మద్దాల రాజేష్, తానేటి వనితలు పాల్గొన్నారు.