వికసించిన కమలం: ఖాతా తెర్చిన బిజెపి, మోడీ విన్
గుజరాత్లో మొదటి ఫలితం వెల్లడైంది. జునాఘడ్ జిల్లాలోని మంగ్రోల్లో బిజెపి అభ్యర్థి రాజేష్ భాయ్ గెలుపొందారు. ఇప్పటి వరకు మూడు స్థానాల్లో గుజరాత్ గెలుపొందింది. కాంగ్రెసు, జిపిపిలు ఇంకా ఖాతా తెరువలేదు. బిజెపి విజయం దిశగా దూసుకు వెళుతుండటంతో అహ్మదాబాదులోని పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు మణి నగర్లో శ్వేతా భట్ పైన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 85 వేలకు పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
మధ్య గుజరాత్లో 50 స్థానాలు ఉండగా బిజెపి 34, కాంగ్రెసు 16, ఉత్తర గుజరాత్లో 27 స్థానాలు ఉండగా బిజెపి 13, కాంగ్రెసు 14, దక్షిణ గుజరాత్లో 28 స్థానాలు ఉండగా బిజెపి 19 కాంగ్రెసు 9 స్థానాల్లో, సౌరాష్ట్రలో బిజెపి 34, కాంగ్రెసు 14 స్థానాల్లో ముందంజలో ఉంది. కేశూభాయ్ పటేల్ ప్రభావం బిజెపిపై కొంత కనిపించినా పెద్ద మొత్తంలో ప్రభావం పడలేదు. నలుగురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.