25న ప్రమాణం: ప్రత్యర్థికి స్వీట్ తినిపించిన నరేంద్ర మోడీ
ప్రతిపక్ష కాంగ్రెసు పార్టీ 60 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ 59 సీట్లలో గెలుపొందింది. కేశూభాయ్ పటేల్ స్థాపించిన గుజరాత్ పరివర్తన్ పార్టీ(జిపిపి) రెండు, నేషనలిస్ట్ కాంగ్రెసు పార్టీ(ఎన్సీపి) ఒకటి, ఇతరులు మూడు సీట్లలో గెలుపొందారు. ఎన్సీపి గత ఎన్నికల్లో మూడు గెలుపొందగా ఇప్పుడు ఒక దానితో సరిపెట్టుకుంది. జెడియు గతంలో ఒక స్థానంలో గెలిచింది. ఈసారి దానిని కూడా కోల్పోయింది.
కాగా ఎన్నికల్లో గెలుపొందిన నరేంద్ర మోడీ మొదట తన తల్లి వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన కొడుకు భారత ప్రధాని అవుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు తనతో విభేదించి వెళ్లి జిపిపి పేరుతో కొత్త కుంపటి పెట్టుకొని తనను దెబ్బతీయాలని భావించిన కేశూభాయ్ పటేల్ ఇంటికి మోడీ వెళ్లారు. ఆయనకు స్వీట్ తినిపించారు. దెబ్బతీయాలనుకున్న కేశూభాయ్ ఇంటికి వెళ్లి మోడీ స్వీట్ తినిపించడం చర్చనీయాంశమైంది.