మోడీ ప్రమాణ స్వీకారానికి బాలయ్య, టిడిపిలో కంగారు
అలాగే తెదేపా అధినేత చంద్రబాబునాయుడుని సైతం నరేంద్ర మోడీ ఆహ్వానించినట్లు సమాచారం. ఇక బాలకృష్ణకు పిలుపు రావటంపై తెలుగు దేశం శ్రేణులు కంగారుపడుతున్నాయి. అయితే బిజిపికి చెందిన కిషన్ రెడ్డి ఫోన్ చేయించినట్లు తెలుస్తోందని , కొన్ని ఛానెల్స్లో వార్తలు వచ్చాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన నరేంద్ర మోడీ ఈనెల 26న నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నరేంద్ర మోడీ తొలిసారిగా 2001 అక్టోబర్లో ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ 2002, 2007లో గద్దెనెక్కారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మూడోసారీ ఘన విజయం సాధించింది. మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమం అహ్మదాబాద్లోని సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుంది.
నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు జయలలిత ఈ వేడుకలకు హాజరవుతున్నట్లుగా అధికార ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గత ఏడాది తమిళనాడు ఎన్నికల్లో జయలలిత గెలుపొందిన తర్వాత ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నరేంద్ర మోడీ కూడా హాజరయ్యారు. ఇప్పుడ మోడీ ప్రమాణ స్వీకారానికి ఆమె హాజరవుతున్నారు.