సూరీడు ఇంట్లో ఎసిబి సోదాలు: రిపుంజయరెడ్డితో లింక్స్
రిపుంజయ రెడ్డి ఎపిపిఎస్సీ సభ్యుడు అయ్యాక భారీగా ఆస్తులు కూడబెట్టినట్లుగా అభియోగాలు ఉన్నాయి. సూరీడు, రిపుంజయ రెడ్డి ఇద్దరు కలిసి ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారిద్దరి ఇళ్లపై ఎసిబి అధికారులు దాడులు చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.
రిపుంజయ రెడ్డికి చెందిన నాలుగు చోట్ల ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. సూరీడు ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాదులోని యూసఫ్గూడలో ఉంటున్న రిపుంజయ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. వెంకటగిరిలో ఆరు ఫ్లాట్లు, రాయలసీమలో కొంత భూమిని రిపుంజయ రెడ్డి కొనుగోలు చేసినట్లుగా ఎసిబి అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.
జూబ్లీహిల్స్లోని గాయత్రి నగర్లో సూరీడు ఇళ్లు ఉంది. అక్కడ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఎపిపిఎస్సీ సభ్యుడు రిపుంజయ రెడ్డితో సంబంధాల నేపథ్యంలో ఆయన ఇంటితో పాటు సూరీడు ఇంటి పైన కూడా ఎసిబి దాడులు చేసి సోదాలు నిర్వహిస్తోంది. మొత్తంగా నాలుగైదు చోట్ల ఎసిబి సోదాలు నిర్వహిస్తోంది. రిపుంజయ రెడ్డి ఇంట్లో కీలక పత్రాలను పరిశీలిస్తోంది.