కాంగ్రెసులో 'టి' లొల్లి: సీమాంధ్ర నేతలకు విహెచ్ సవాల్
అయితే కాంగ్రెసు పార్టీలో మాత్రం ఇంకా తెలంగాణ లొల్లి ఆగిపోలేదు. ఏ ప్రాంతానికి ఆ ప్రాంత నేతలు తామంటే తాము అంటున్నారు. అఖిల పక్ష సమావేశంలో అయినా అధిష్టానం ముందు అయినా తమది సమైక్య నినాదమే అని మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి చెప్పారు. తెలంగాణ నేతల ఒత్తిళ్లకు అధిష్టానం లొంగుతుందని తాము భావించడం లేదన్నారు. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పారు.
తెలంగాణవాదం వినిపించడంలో వెనుకంజ వేసేది లేదని ఆ ప్రాంత నేతలు మల్లు రవి, సురేష్ రెడ్డి చెబుతున్నారు. అఖిల పక్షంలో తెలంగాణ వాదం వినిపించే నేతలను పంపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు కాంగ్రెసు పార్టీ కట్టుబడి ఉండాలని పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు డిమాండ్ చేశారు. తెలంగాణ వాదం వినిపించే వారిని పంపించాలని ఆయన నాయకత్వాన్ని కోరారు.
కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే 16 పార్లమెంటు స్థానాలను గెలిపించే బాధ్యతను తాము తీసుకుంటామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచితే ఎన్ని సీట్లు గెలిపిస్తారో సీమాంధ్ర నేతలు చెప్పాలని ఆయన సవాల్ చేశారు. తెలంగాణ ఇవ్వకుంటే కాంగ్రెసు పార్టీకి కష్టకాలం ఖాయమన్నారు. అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ధర్మాన ప్రసాద రావు ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవాలని, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణకు ఓ న్యాయం ధర్మానకు ఓ న్యాయమా అన్నారు. డిసెంబర్ 9 ప్రకటనకు కాంగ్రెసు కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ ఇస్తే కెసిఆర్ తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని చెబుతున్నారని, సమైక్యాంధ్ర ుఉంటే జగన్ కలిపేస్తారా చెప్పాలన్నారు.