మిత్రుడింట్లో యువతి మృతి: వేధింపులు అన్న దృష్టికి
హత్యగావింపబడ్డ యువతి యూజిసి నెట్ పరీక్ష రాసేందుకు నగరానికి వచ్చింది. ఆమె తన స్నేహితుడు శివకుమార్ ఇంట్లో సోమవారం విగత జీవిగా కనిపించింది. ఆమెపై అత్యాచారయత్నం చేసి, హత్య చేసినట్లుగా పోస్టుమార్టం నివేదికలో వెల్లడైనట్లుగా సమాచారం. శివకుమారే ఆమెను హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫోన్ స్విచ్ఛాప్ చేసి పెట్టాడు.
శివకుమార్తో పాటు మరో ఇద్దరు కలిసి ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉస్మానియాలో యువతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలు ఉస్మానియి విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేసింది. శివకుమార్ కూడా ఉస్మానియా నుండి గ్రాడ్యుయేట్ పట్టా తీసుకున్నారు. కాగా విద్యార్థిని హత్యను నిరసిస్తూ, నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ.. ఉస్మానియా విద్యార్థులు ఛత్రినాక, అఫ్జల్గంజ్ వద్ద ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించడంతో పాతబస్తీలో ట్రాఫిక్ జాం అయింది.
వేధింపులు అన్న దృష్టికి తెచ్చిన మృతురాలు
తనను కొద్దికాలంగా శివకుమార్ అనే విద్యార్థి వేధిస్తున్నట్లుగా తన దృష్టికి తన చెల్లి తీసుకు వచ్చిందని మృతురాలు సోదరుడు చెప్పారు.
కాగా ఓయు విద్యార్థి అరుణ మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. ఆమె మృతదేహాన్ని స్వగ్రామం పంపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తుండగా ఉస్మానియా విద్యార్థులు న్యాయం జరిగే వరకు కదలనిచ్చేది లేదని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు.