జగన్ రిమాండ్ 14 రోజులు పొడగింపు, వీడియో విచారణ
జగన్తో పాటు ఇతర నిందితులను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విచారణ అనంతరం వారి జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు 14 రోజుల పాటు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జగన్ స్టాట్యుటరీ బెయిల్ పిటిషన్ను రాష్ట్ర హైకోర్టు ఇంతకు ముందు తిరస్కరించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ఈ నెల 4వ తేదీన విచారణకు రానుంది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసు నిందితులను కూడా కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, వారి రిమాండ్ను కూడా ఈ నెల 17వ తేదీ వరకు పొడగించింది. ఒఎంసి కేసులో నిందితులైన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఒఎంసి మాజీ డైరెక్టర్ బివి శ్రీనివాస రెడ్డి, విడి రాజగోపాల్, అలీఖాన్ జ్యుడిషియల్ రిమాండ్ను కోర్టు పొడగించింది.
అంతకు ముందు, ఒఎంసి కేసులో సిబిఐ అలీఖాన్పై చార్జిషీట్ దాఖలు చేసింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసులో కూడా సునీల్ రెడ్డి తదితర నిందితుల జ్యుడిషియల్ రిమాండ్ను జనవరి 17వ తేదీ వరకు పొడగించింది.