జగన్ పార్టీలో చేరను, తెలంగాణ తేలుతుంది: ముఖేష్
విభజన అనివార్యమైతే తమ డిమాండ్లు తమకు ఉన్నాయన్నారు. విభజన లేకుంటే సమైక్యంగానే ఉంటుందన్నారు. విభజన జరిగితే మాత్రం హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే ఊరుకునే సమస్య లేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే తమ డిమాండ్ అన్నారు. గ్రేటర్ హైదరాబాదుకు ప్రత్యేక రక్షణ నియమావళి కావాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాదులో ఉన్న ప్రజల హక్కులను కాపాడాలన్నారు.
ఎల్లుండి జరగబోయే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల సమావేశం పైన తనకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. పాతబస్తీకే పరిమితమై ఉన్న మజ్లిస్ పార్టీ కాంగ్రెసు వల్లే ఎదిగిందని చెప్పారు. నెల రోజుల్లో తెలంగాణ సమస్యకు కేంద్రం పరిష్కారం చూపిస్తుందని తాను విశ్వషిస్తున్నానని చెప్పారు. ఇలాగే చేస్తుందని తాను చెప్పలేనని, అయితే నెల రోజుల్లో ఓ ఆమోదయోగ్య పరిష్కారం లభిస్తుందని మాత్రం చెప్పగలనన్నారు.
నల్గొండ నేతలకు బొత్స సూచన
నల్గొండ జిల్లా నేతలు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య వివాదంపై పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ వేరుగా స్పందించారు. వారిద్దరితో తాను మాట్లాడతానని చెప్పారు. ఇంతటితో ఈ వివాదానికి వారు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.