లంచం ఆరోపణలు: చిక్కుల్లో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి
ముడుపులు ఇచ్చినందుకు పిటిషనర్లపై కూడా చర్యలు ఉంటాయని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అన్నారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది పివి కృష్ణయ్య వాదనలు వినిపించారు.ట విచారణ సంక్రాంతి సెలవుల తర్వాతకు వాయిదా పడింది. స్కూలును డిసెంబర్ 31వ తేదీ నుంచి మూసేయాలని డిఇవో ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆ పిటిషన్ వేశారు.
మంత్రికి, ఇతర అధికారులకు ఇచ్చిన 50 లక్షల రూపాయలను తమకు తిరిగి ఇప్పించాలని, మంత్రి ఆదాయానికి మించిన ఆస్తులపై సిబిఐ చేత విచారణ జరిపించాలని, ఇతర అధికారులపై ఎసిబి దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్లు హైకోర్టును కోరారు.
కాగా, శ్రీచైతన్య టెక్నో స్కూల్ యాజమాన్యం ఆరోపణలను మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. శ్రీచైతన్య టెక్నో స్కూల్ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని ఆయన అన్నారు. ఎవరి వద్ద కూడా తాను డబ్బులు తీసుకోలేదని ఆయన శనివారంనాడు అన్నారు. తనపై కేసు వేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. కేసు వేసిన వ్యక్తి ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు.