పిక్చర్స్: చలికి క్రికెటర్లు ఇలా... చలిమంట కాగుతూ..
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీని చలి వణికిస్తోంది. చల్లగాలికి ప్రాణాలు తట్టుకోలేకపోతున్నాయి. ఈ శీతాకాలంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో భారత క్రికెటర్లు తలపడాల్సి వచ్చింది. తలపడి, గెలవాల్సిన అనివార్యతలో భారత క్రికెటర్లు పడ్డారు. కనిష్ట ఉష్ణోగ్రత 1.9 సెల్సియస్ డిగ్రీలకు పడిపోయిన స్థితిలో వేడి కోసం భారత క్రికెటర్లు నానా తంటాలు పడ్డారు.
క్రికెట్ మ్యాచు ఆడుతూ భారత ఆటగాళ్లే కాదు, పాకిస్తాన్ క్రికెటర్లు కూడా వేడి పుట్టించుకోవడానికి నానా పద్ధతులను పాటించారు. సోమవారంనాడు ఢిల్లీ కనిష్ట ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ మాత్రమే ఉంది. పొగమంచు లేకపోవడంతో మసక లేదు. దాంతో చూపు సరిగ్గానే ఆనుతూ వచ్చింది.
ఢిల్లీలోనూ,
పరిసర
ప్రాంతాల్లోనూ
వచ్చే
రెండు
మూడు
రోజుల్లో
ఉష్ణోగ్రత
పెరుగుతుందని
వాతావరణ
పరిశోధనా
కార్యాలయం
అధికారులు
చెబుతున్నారు.
మరికొద్ది
రోజులు
ఉత్తర
భారతదేశంలోని
ఉత్తరప్రదేశ్,
హర్యానా,
పంజాబ్,
జమ్మూ
కాశ్మీర్
రాష్ట్రాల్లో
చలి
వణికించే
అవకాశాలున్నాయని
అంటున్నారు.
ఉష్ణోగ్రతలు
మరింత
తగ్గే
అవకాశాలున్నాయని
చెబుతున్నారు.
ఎముకలు కొరికే చలిలో వేడి కోసం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో భారత ఆటగాళ్లు అరచేతులను మడిచి ఇలా కనిపించారు.
అదివారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పాకిస్తాన్తో జరిగిన మూడో వన్డే మ్యాచులో తన చేతులతో వేడిని పుట్టించుకోవడానికి ప్రయత్నిస్తూ విరాట్ కోహ్లీ ఇలా...
ఫిరోజ్ షా కోట్లా మైదానంలో చలిని తట్టుకోవడానికి బాటిళ్ల నుంచి తమపైకి వేడి నీళ్లను కుమ్మరించుకుంటూ యువరాజ్ సింగ్, సురైష్ రైనా..
బాటిళ్లలోని వేడి నీటితో దేహాలను వేడెక్కించుకుంటున్న యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ...
చలి మంటను కాగతూ ఢిల్లీ ప్రజలు ఇలా..... ఏమి హాయిలే...
చలి నుంచి తమను తాము కాపాడుకోవడానికి మంట చుట్టూ చేరి ఇలా...
అలహాబాదులో సంగంలో మంట చుట్టూ చేరి, చలిపులి నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ...
కాశ్మీరీ మహిళలు తాగడానికి నీటిని ఇలా పిండుకుంటూ... ఆదివారం అనంతనాగ్లో ఈ దృశ్యం ఇలా...
వారణాసిలో ఇళ్లు లేని ప్రజలు ఇలా నిండా వస్త్రాలు కప్పుకుని....
కాశ్మీర్లో అదివారం 4.6దాల్ సరస్సు కొన్ని భాగాలు గడ్డ కట్టుకుపోయి ఇలా కనిపంచింది.
న్యూఢిల్లీ ఆదివారంనాడు వెచ్చటి వస్త్రాలు కప్పుకుని చలి నుంచి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ..