అక్బర్ అరెస్ట్ రోజు ఆలస్యమైనా..: విహెచ్, కావూరి పైనా
ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివ రావు పార్టీ నుండి వెళ్లాలని నిర్ణయించుకున్నారని అన్నారు. అందుకే ఆయన ఏమైనా మాట్లాడతారని అన్నారు. కాంగ్రెసు పార్టీని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని విమర్సించడం ఆయనకు తగదని అన్నారు. ఆయన బయటకు వెళ్లాలనుకున్నాడు. కాబట్టే అధిష్టానంపై నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఉస్మానియా వైద్య కళాశాలలో సీట్లు పెంచక పోవడం శోచనీయం అన్నారు. ఈ విషయాన్ని తాను ముఖ్యమంత్రికి చెప్పానన్నారు. డాక్టర్లు, పేషెంట్లు లేని ప్రయివేటు కళాశాలల్లో సీట్లు పెంచి ఉస్మానియాలో సీట్లు పెంచేందుకు నిరాకరించడం సరికాదన్నారు. దీనిని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లాలని సిఎంను కోరానన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపు అంశాన్ని కూడా తాను ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించానని చెప్పారు. మన గ్యాసును ఇతర రాష్ట్రాలకు ఇచ్చి మనం ఛార్జీలు పెంచుకోవడమేమిటని కిరణ్ను అడిగానన్నారు. ఇలాంటి అంశాలలో కేంద్ర విధానాల్లో మార్పులు కోరమని తాను అడిగానని చెప్పారు.