జగన్ పార్టీలోకి కాంగ్రెసు ఎమ్మెల్యే ద్వారంపూడి జంప్
ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారని మొదటి నుంచీ అనుకుంటోందే. ఇందులో ఆశ్చర్యమేమీ లేదని కాంగ్రెసు వర్గాలు అంటున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారా టికెట్లు పొంది, విజయం సాధించన శానససభ్యులు ఇంకా కొంత మంది ఉన్నారని, వారంతా వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారని అంటున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా, ప్రకాశం జిల్లాలో కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అద్దంకి శానససభ్యుడు గొట్టిపాటి రవికుమార్తో పాటు దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గొట్టిపాటి రవికుమార్తో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు, సీనియర్ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు శానససభ్యులు కూడా ఈ నెలాఖరులోగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని అంటున్నారు.