పరిటాల తనయుడు శ్రీరామ్పై, ఇతరులపై రౌడీషీట్
ఇదిలావుంటే, సుధాకర్ రెడ్డి హత్య కుట్ర కేసులో మరో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయుధాలు కలిగి ఉన్న ముగ్గురిని పోలీసులు రెండువారాల క్రితం పట్టుకోవడం, సుధాకర్రెడ్డి హత్య కోసం వచ్చినట్లు వారు వెల్లడించడం సంగతి తెలిసిందే. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్తో పాటు రాఘవేంద్ర అనే మరో వ్యక్తికి జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పరిటాల శ్రీరామ్ గురువారం ధర్మవరం రూరల్ పోలీసుస్టేషన్ ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో నిందితులైన మరో ఆరుగురిని ధర్మవరం రూరల్ పోలీసులు పట్టుకుని శుక్రవారం రాత్రి ధర్మవరం కోర్టు జూనియర్ సివిల్ జడ్జి రామచంద్రుడు ఎదుట హాజరు పరిచారు.
ఈ నిందితుల్లో ధర్మవరం పట్టణానికి చెందిన అరవ చల పతి, దుర్గానగర్కు చెందిన ప్రకాశ్, బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామానికి చెందిన నాగేశ్నాయుడు, రామగిరికి చెందిన శ్రీనివాసులు, కుంటిమద్దికి చెందిన శివశంకర్, రామగిరికి చెందిన చలపతి ఉన్నారు.