సుమన్కు షరతులతో బెయిల్: వేధింపులన్న రమేష్
కాగా అంతకుముందు చంచల్గూడ మహిళా జైలులో రిమాండ్లో ఉన్న సుమన్ రాథోడ్ను కూకట్పల్లి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ కేసులో ఎమ్మెల్యే లొంగిపోవడంతో శుక్రవారం రాత్రి చంచల్గూడ జైలుకు తరలించారు. ఎమ్మెల్యేను తదుపరి విచారణకు కోర్టు ఒక రోజు అనుమతి ఇవ్వడంతో ఉదయం కూకట్పల్లి పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించి తిరిగి జైలుకు తరలించారు.
హైదరాబాదులోని కెపిహెచ్బి కాలనీలో ఆరో ఫేజ్లో సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి 400 గజాల భూమిని అక్రమంగా ఆక్రమించుకుని ఇతరులకు విక్రయించడానికి ప్రయత్నించారని ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. ఈ కేసులో ఆమె ఎ4 నిందితురాలు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఆ భూమిని ఇతరులకు విక్రయించడానికి సుమన్ రాథోడ్ మరికొంత మందితో కలిసి అమ్మడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి.
వేధింపులు
తన భార్యను అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం కేసులో ఇరికించిందని సుమన్ నాథోడ్ భర్త ఎంపి రమేష్ రాథోడ్ ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను వేధించటమే పనిగా పెట్టుకొని ఆ పార్టీ నాయకులు కట్ర చేస్తున్నారని విమర్శించారు.