జగన్ ఎమ్మెల్యేపై లాయర్ల ఫిర్యాదు:సమైక్యభేటీతో టెన్షన్
ఈ భేటీ కోసం సీమాంధ్ర ప్రతినిధులు ఒక్కరొక్కరు వస్తున్నాయి. ఈ భేటీని అడ్డుకుంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ జెఏసి కూడా భేటీని అడ్డుకుంటామని చెప్పింది. ఈ నేపథ్యంలో మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలో పోలీసు బలగాలను మోహరించారు. సమావేశం జరిగే ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించారు.
సమైక్యాంధ్ర భేటీని నిరసిస్తూ తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి గన్ పార్క్ వద్ద మౌన దీక్షను చేపట్టింది. జెఏసి చైర్మన్ కోదండరామ్ ఆధ్వర్యంలో ఈ మౌన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నగర మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లు రోజుకో మాట మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణకు అనుకూలంగా ఉన్న సమయంలో ఇలాంటి ప్రకటనలు సరికావన్నారు. తెలంగాణపై త్వరగా ప్రకటన చేయాలని ఆయన అన్నారు. చింతన్ బైఠక్లో తేల్చాలన్నారు. తెలంగాణపై ప్రకటన చేసే వరకు కేంద్రాన్ని నమ్మలేమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని ఉద్యోగ సంఘాల నేతలు విఠల్, దేవీ ప్రసాద్ అన్నారు.
సీమాంధ్ర సభను అడ్డుకునేందుకు తెలంగాణ విద్యార్థులు పలువురు ప్రయత్నించారు. వారిని పోలీసులు వారించే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అదుపులోకీ తీసుకున్నారు. వారిని గోషామహల్ పోలీసు స్టేషన్కు తరలించారు. మరోవైపు సీమాంధ్ర సభను వ్యతిరేకిస్తూ, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ క్లబ్బులో తెలంగాణ కళాకారులు డిమాండ్ చేశారు.