పీలా వర్గం దాడి: బండారుకు బాలయ్య పరామర్శ
బండారు సత్యనారాయణ మూర్తిపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీకి సూచించారు. వ్యవహారాన్ని క్రమశిక్షణా సంఘం పరిశీలించి, తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని ఆయన బండారుకు హామీ ఇచ్చారు. ఎన్టీ రామారావు విగ్రహానికి నివాళులు అర్పించడానికి వచ్చిన బండారు సత్యనారాయణ మూర్తిపై పీలా శ్రీనివాస్ వర్గీయులు దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బండారు సత్యనారాయణ మూర్తి - పీలాపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.
విశాఖ జిల్లా పెందుర్తిలో ఎన్టీఆర్ వర్ధంతి సభ శుక్రవారం రసాభాసగా మారింది. ఎన్టీఆర్ వర్ధంతి సభ వేదికగా తెలుగు తమ్ముళ్ల మధ్య ఘర్షణ జరిగింది. షీలా శ్రీనివాస రావు, బండారు సత్యనారాయణ మూర్తి వర్గీయల మధ్య ఘర్షణ జరిగింది. బండారు సత్యనారాయణ మూర్తి పైన షీలా అనుచరులు దాడికి దిగారు. బండారు వర్గం ఎదురు తిరగడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక నేతలు, పోలీసులు ఇరువర్గాల వారిని శాంతపర్చారు.
పీలా వర్గానికి, బండారు సత్యనారాయణ మూర్తి వర్గానికి మధ్య గత కొంత కాలంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు సమాచారం. పీలా శ్రీనివాస్ నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఇందులో భాగంగానే శుక్రవారం బండారు సత్యనారాయణ మూర్తిపై దాడి జరిగిందని అంటున్నారు. దాడి జరిగిన తర్వాత బండారు సత్యనారాయణ మూర్తిని పీలా శ్రీనివాస్ కారు ఎక్కించి పంపించారు.