వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటి తెలంగాణ కోసమా?: ఎపిఎన్జీవో, తెలంగాణపై కిషోర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishore Chandradev
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ విషయంలో పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావులేదని కేంద్రమంత్రి కిషోర్ చంద్రదేవ్ బుధవారం అన్నారు. విభజన విషయంలో పార్టీ నిర్ణయమే తమ నిర్ణయం అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదించాలని, అదే ఫైనల్ అని ఆయన అన్నారు. ఢిల్లీ పర్యటన తర్వాత సమైక్యాంధ్రపై తమకు నమ్మకం పెరిగిందని మంత్రి పార్థసారథి అన్నారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ నేతలు అందరూ కట్టుబడి ఉండాలన్నారు.

ఎపిఎన్జీవో ప్రశ్నల పరంపర

తమ ఢిల్లీ పర్యటన ద్వారా రాష్ట్ర విభజన జరగదని తేలిపోయిందని ఎపిఎన్జీవోలు అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రేపు సీమాంధ్రలో ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తామన్నారు. రాజకీయ పార్టీలతో కలిసి ఓ ఐక్యకార్యాచరణ సమితి(జెఏసి)ని ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర విభజన జరిగితే అన్ని ప్రాంతాల పరిస్థితి సోమాలియా కంటే అధ్వాన్నంగా ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటుందన్నారు. కేంద్రం అన్నింటిని పరిగణలోకి తీసుకొని సమైక్యాంధ్ర వైపు మొగ్గు చూపుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాదుకు ఐటి కంపెనీలు కేవలం తెలంగాణ కోసమే రాలేదని వారు అన్నారు. శంషాబాదులోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం నిర్మాణం కేవలం తెలంగాణ నేతల డబ్బులతో జరగలేదని వారు విమర్శించారు. రాష్ట్ర విభజనకు కేంద్రం అననుకూలం అని తేలిందన్నారు.

సమైక్యాంధ్ర కోసం బంద్

సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ సమితి పిలుపు మేరకు సీమాంధ్రలోని పలు ప్రాంతాల్లో బందు కొనసాగుతోంది. దుకాణాలు, కార్యాలయాలను ప్రజలు స్వచ్చంధంగా మూసివేశారు. సమైక్యాంధ్రవాదులు ర్యాలీలు చేపట్టారు.

English summary
APNGOs hoped that state will not divide at any cost.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X