తెలంగాణపై కేంద్రం ఇంకా చర్చిస్తోంది: మనీష్ తివారీ
తెలంగాణకు అనుకూలంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను కోరారు. ఆయన గురువారంనాడు షిండేను కలిశారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఇప్పటి వరకు 800 మందికిపై యువకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన చెప్పారు. తెలంగాణపై తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సిన అవససరం ఉందని ఆయన అన్నారు.
తెలంగాణపై ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ యువతను కోరారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆయన గురువారం హైదరాబాదులో వ్యాఖ్యానించారు. తెలంగాణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడంతో ఇక తెలంగాణ రాదనే బెంగతో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు.
తెలంగాణకు మద్దతు తెలిపిన శరద్ పవార్కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. శరద్ పవార్ సూచనమేరకైనా ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకోవాలని ఆయన గురువారం హైదరాబాదులో అన్నారు.