సహకార :'9మంది జగన్ ఎమ్మెల్యేల బహిష్కరణ' వీరే..
డబ్బుల కోసం ఇతర నేతలకు అమ్ముడుపోయిన, వ్యక్తిత్వం లేని వారిని తాము పట్టించుకోమన్నారు. నేతల తీరుపై తాము తెలుగుదేశం పార్టీలో పూటకోమాట మాట్లాడమని చెప్పారు. జగన్ వైపు వెళ్తున్న తొమ్మిది మందిని తాము బహిష్కరించామన్నారు. రాజీనామాలు చేసిన వారి గురించి సభాపతి నాదెండ్ల మనోహర్ చూసుకుంటారన్నారు. అనర్హతపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. సహకార ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు వచ్చినందు వల్లే కాంగ్రెసు ఈ నిర్ణయం తీసుకొని ఉండి ఉంటుందంటున్నారు.
కాగా జగన్ వైపు ఇటీవల పలువురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు వెళ్లిన విషయం తెలిసిందే. వారి పైనే వేటు వేసినట్లు బొత్స చెప్పారు. బొత్స వేటు వేసినట్లు చెప్పిన వారిలో ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి, గొట్టిపాటి రవి కుమార్, ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావు, పేర్ని నాని, మద్దాల రాజేష్ ఉన్నారు. మరో ముగ్గురిలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జోగి రమేష్ల పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్గూడ జైలులో ఉన్నారు.
2009లో కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన గెలిచిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ తొమ్మిది మందిలో ఇప్పటికే కొందరు జగన్ పార్టీలో చేరగా మరికొందరు చేరుతామని ప్రకటించారు. ఇంకొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.