సోలోమన్ దీవుల్లో భారీ భూకంపం: సునామీ హెచ్చరిక
హవాయి దీవులకు మాత్రం ప్రమాదం లేదని తెలిపింది. సోలోమన్లరో వచ్చిన భారీ భూకంపం కారణంగా దీవుల్లో పలు ఇళ్లు నేల మట్టమయ్యాయి. నీటి అలల తాకిడికి కూడా కొంత నష్టం జరిగింది. దాదాపు పదమూడు గ్రామాలను నీరు ముంచెత్తినట్లుగా తెలుస్తోంది. సునామీ హెచ్చరికలతో దక్షిణ పసిఫిక్లోని పన్నెండు దేశాలు అప్రమత్తమయ్యాయి. భూకంపం సోలోమన్ దీవుల్లోని శాంటాక్రజ్ ద్వీపంలో చోటు చేసుకుంది.
భూకంప కేంద్రం కిరాకిరాకు 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. భూకంప కేంద్రం భూమిలోపల ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని మొదట చెప్పిన అమెరికా జియోలాజికల్ సర్వే ఆ తర్వాత 28 కిలోమీటర్లకు పైగా లోతులో ఉందని తెలిపింది. భూకంపం కారణంగా సోలోమన్ దీవిలో పలు గ్రామాలు నేల మట్టమయ్యాయని పోలీసులు చెప్పారు. అయితే అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
సునామీ హెచ్చరికలను సోలోమన్ దీవులు, వనౌతు, నౌరు, న్యూగినియా, తువాలు, న్యూ కొలెడోనియా, కోస్రా, ఫిజి, కిరిబాతి, వాల్లిస్, ఫుతునా ప్రాంతాలకు జారీ చేశారు. కాగా 2007లో వచ్చిన సునామీ కారణంగా 52 మంది మరణించారు. దీంతో ఇప్పుడు ఆయా దేశాలు అప్రమత్తమయ్యాయి.