తొక్కిసలాట: విక్టిమ్స్ గోడు పట్టని అఖిలేష్, పెళ్లిలో బిజీ
సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో అలహాబాద్ రైల్వే స్టేషన్లో ఐదు, ఆరు ప్లాట్ఫారాల మధ్య ఉన్న కాలి వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది ఆ సమయంలో రైల్వే స్షేషన్లో ఉన్నారు. గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించి భక్తులు ఇళ్లకు తిరిగి వెళ్తుండగా ఆ విషాద సంఘటన చోటు చేసుకుంది.
ప్రమాదం సంభవించిన కొన్ని గంటల తర్వాత కూడా యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాధితులను పరామర్సించడానికి రాలేదని, కజిన్ పెళ్లిలో ఉన్నారని మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అఖిలేష్ యాదవ్తో పాటు కొంత మంది మంత్రులు కూడా ఆ పెళ్లిలో ఉన్నారు.
బాధితులకు సహాయం అందించే విషయంలో సమాజ్వాదీ, ప్రభుత్వ ప్రతిస్పందనలో జాప్యం ఎందుకు జరిగిందనేది ఎవరికీ తెలియదు. పైగా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, రైల్వే శాఖ పరస్పరం నిందలు వేసుకుంటున్నాయి. తమ వైపు నుంచి ఏ విధమైన పొరపాటు జరగలేదని, రైల్వే శాఖనే ప్రమాదానికి బాధ్యత వహించాలని యుపి ప్రభుత్వం అంటోంది. ప్రమాదానికి యుపి ప్రభుత్వ యంత్రాంగాన్ని రైల్వే శాఖ మంత్రి పవన్ కుమార్ బన్సాల్ తప్పు పట్టారు.