మహిళా టెక్కీపై దాడి: కేకలేయగా రక్షించిన స్థానికులు
దుండగులు అనుకోకుండా ఒక్కసారిగా తనపై దాడి చేయడంతో నీలిమ అప్రమత్తమైంది. వెంటనే గట్టిగా కేకలు వేసింది. నీలిమ ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే మేలుకొని సంఘటనా స్థలానికి వచ్చారు. జరిగిన విషయాన్ని గుర్తించి వచ్చిన దుండగులకు దేహశుద్ధి చేశారు. అనంతరం నిందితులను పోలీసులకు అప్పగించారు. అప్రమత్తంగా ఉండి కేకలు వేయడం, ఇరుగుపరుగు వారు తక్షణమే స్పందించడంతో నీలిమ దొంగల బారి నుండి బయటపడింది.
హైకోర్టు ఎదుట ఆత్మహత్యాయత్నం
తమ కుమారుడి ఆచూకి కనిపెట్టమని ఓ కుటుంబం హైకోర్టును ఆశ్రయించింది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం గుడిమెట్ల గ్రామానికి చెందిన ప్రభాకర్ను గత నెల 26న గిద్దలూరు పోలీసులు ఓ దొంగతనం కేసులో విచారణ నిమిత్తం స్టేషనుకు పిలిచారు. ఆ రోజు నుండి తన కొడుకు కనిపించకుండా పోయాడని బంధువులు, పరిచయస్తులను అడిగనా జాడ దొరకలేదని కోర్టుకు తెలిపారు.
పోలీసులే తమ కుమారుడి అదృశ్యానికి కారణమని వారు చెప్పారు. తమ కొడుకును తీసుకు రాకుంటే ఆత్మహత్యకు పాల్పడుతామని వారు హెచ్చరించారు. దీంతో ముందు జాగ్రత్తగా చార్మినార్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ చేశారు.