గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు రాజకీయాలా? కన్నీళ్లొస్తున్నాయి: బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
గుంటూరు: ప్రజల కోసం కష్టపడటంలో ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అన్నారు. ఆయన పాదయాత్ర గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలు సందర్భాలలో మాట్లాడారు. తన కాళ్లు మొరాయిస్తున్నాయని, కళ్ల వెంట కన్నీరు వస్తోందని అయినా, ప్రజల కోసం కష్టపడటంలో దానినంతా మర్చిపోతున్నానని అన్నారు.

తాను గురువారం రోజు పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డానని అన్నారు. భగవంతుడి సంకల్పం, ప్రజల ఆశీస్సులతోనే తాను పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా వచ్చిన సామాన్యులను మంత్రులుగా, శాసనసభ్యులుగా, శాసనమండలి సభ్యులుగా చేస్తే వారు ఇప్పుడు విశ్వాసం లేకుండా పార్టీలు వీడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అలాంటి వారి వల్ల తెలుగుదేశం పార్టీకి జరిగే నష్టమేమీ లేదన్నారు. వారే నష్టపోతారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వంటి అవినీతిపరులు రాజకీయాలలో ఉండటం మన దురదృష్టకరమన్నారు. టిడిపిని వీడుతున్న నేతలు ప్యాకేజీలకు అమ్ముడుపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్యాకేజీలకు అమ్ముడు పోతున్న వారికి ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారన్నారు.

English summary
Telugudesam Party chief Nara Chandrababu Naidu has 
 
 responded on leaders who are joining in YSR Congress 
 
 Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X