మాకూ పుణ్యమివ్వండి: టిఎస్సార్, ఆలోచిస్తా: చిరంజీవి
మన దేశంలో పర్యటించే విదేశీ పర్యాటకులకు ఇక్కడికి వచ్చాక వీసా జారీచేసేలా పదకొండు దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. మరో 9 దేశాలతోను సంప్రదింపులు సాగుతున్నాయని, దశల వారీగా ఒప్పందాలు చేసుకుంటామని తెలిపారు. భద్రత సంబంధ సమస్యలున్న దేశాలు మినహా అన్ని దేశాలతో ఇలాంటి ఒప్పందాలకు ప్రయత్నిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్లో ఏప్రిల్ 11 నుంచి 14 వరకు ప్రపంచ పర్యాటక సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో పాకశాస్త్ర (కలినరీ) శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 20 ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరామన్నారు. దీన్ని హైదరాబాద్ లేదా తిరుపతిలో ఏర్పాటు చేసే అవకాశాలున్నాయన్నారు. నిజాం నగల ప్రదర్శన దిశగా చొరవ తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోని బౌద్ధారామాల సందర్శకుల కోసం దేశంలోని బౌద్ధ కేంద్రాల అనుసంధానం చేపడతామన్నారు.
క్లీన్ ఇండియాలో భాగంగా విక్టోరియా టెర్మినస్తదితర ఆరు చారిత్రక స్థలాలపై ఓఎన్జీసితో ఒప్పందాలు కుదిరాయన్నారు. విశాఖ పరిసర తీరప్రాంత అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. చిరంజీవి బ్లడ్బ్యాంకును పుణ్యం బ్యాంక్గా అభివర్ణించిన టి.సుబ్బిరామి రెడ్డి, రక్త నిధికి ఎంపీల్యాడ్స్ నుండి రెండు అంబులెన్స్ల కోసం రూ.50 లక్షలు కేటాయిస్తానని చెప్పారు. విశాఖలో చిరంజీవి రక్త నిధిని ఏర్పాటు చేసి తమకూ పుణ్యం పంచాలని కోరారు. అందుకు చిరంజీవి.. రక్త నిధి ఏర్పాటులో చాలా ఇబ్బందులు ఉంటాయని, వాటిని భరిస్తానంటే ఆలోచిస్తానని చెప్పారు.