వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉండవల్లిపై వరంగల్‌లో కేసు, రెచ్చగొట్టారని ఆరోపణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Undavalli Arun kumar
వరంగల్: కాంగ్రెసు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్‌పై కేసు నమోదు చేయాలని వరంగల్ ఆరో అదనపు మునిసిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇంచార్జీ న్యాయమూర్తి నసీమ్ సుల్తానా సోమవారం పోలీసులను ఆదేశించారు. హన్మకొండ విద్యారణ్యపురికి చెందిన సమాజ సేవకుడు కపిలవాయి రవీందర్ ఈ నెల 14వ తేదీన కోర్టులో ఉండవల్లిపై ఫిర్యాదు చేశారుడ.

రవీందర్ ఫిర్యాదును పరిశీలించిన మెజిస్ట్రేట్ ఉండవల్లిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. జనవరి 25వ తేదీన రాజమండ్రిలో నిర్వహించిన సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని రవీందర్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఉండవల్లిపై కేసు నమోదు చేసి, సంఘటనపై దర్యాప్తు చేసిన వచ్చే నెల 25వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మెజిస్ట్రేట్ కాకతీయ విశ్వవిద్యాలయం పోలీసులను ఆదేశించారు. జనవరి 25వ తేదీన రాజమండ్రిలో జై ఆంధ్రప్రదేశ్ పేరిట ఉండవల్లి అరుణ్ కుమార్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఆ సభలో కాంగ్రెసుకు చెందిన పలువురు సీమాంధ్ర నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను వ్యతిరేకిస్తూ సాగిన ఈ సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

English summary
Warangal local court has ordered the police to book case against Rajamundry Congress MP Undavalli Arun kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X