ఖమ్మం టిడిపిలో ముసలం: జగన్ ఇలాకాలో వాయిదా
విజయ్ బాబు, రమేష్ల వ్యవహారాన్ని పార్టీ అధిష్టానం చల్లబర్చే ప్రయత్నా చేసింది. చెరో రెండున్నర సంవత్సరాలు చైర్మన్గా ఉండాలని సూచించింది. అయితే, అధిష్టానం సూచనను బోడేపూడి రమేష్ బాబు అంగీకరించలేదు. పార్టీని వీడేందుకు రమేష్ బాబు సిద్ధమయ్యారు. కాగా, డిసిసిబి ఉపాధ్యక్షుడిగా సిపిఐకి చెందిన హేమంతరావును ఎన్నుకున్నారు. డిసిఎంఎస్ అధ్యక్షుడిగా అంజయ్య, ఉపాధ్యక్షుడిగా బోయినపల్లి సుధాకర్ ఎన్నికయ్యారు.
వరంగల్ జిల్లా డిసిసిబి ఎన్నికల ఫలితాల వ్యవహారం రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకు చేరింది. డిసిసిబి ఎన్నికల ఫలితాలు ప్రకటించకుండా వాయిదా వేయడంపై కాంగ్రెసు అభ్యర్థి జంగారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ఫలితాల నిలిపివేతను వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా సహకార ఎన్నికల్లో టిడిపి సహకారం వల్లే తాను గెలిచినట్లు డిసిసిబి చైర్మన్ రాజశేఖర రెడ్డి చెప్పారు.
కడప జిల్లా డిసిసిబి ఎన్నిక రేపటికి వాయిదా పడింది. డిసిసిబి ఎన్నికల అధికారి చంద్రశేఖర్ నిన్నటి నుండి అదృశ్యం కావడం, ఈ రోజు చిత్తూరు జిల్లాలో దొరకడం తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఎన్నికలను రేపటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నికల వాయిదాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యతిరేకిస్తోంది.