కిరణ్ ఫోజులు కొడుతున్నారు, వైయస్ దోపిడీయే: బాబు
కిరణ్ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి దోపిడీని కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన 6.8 కిలోమీటర్లు నడిచి, వేమూరు చేరుకున్నారు. అక్కడ ఉన్న స్టేషన్లోకి వెళ్లారు. డిఎస్పి, సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లను సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. కిరణ్కు ఒళ్లంతా అహమేనని, ప్రజాసంక్షేమం గురించి ఆలోచించిన పాపాన పోడని, అంతా తెలుసన్నట్లుగా ఫోజులు కొడతారన్నారు.
వైయస్ ప్రారంభించిన దోపిడీని ప్రతి ఫైలులోనూ కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ నుంచి వలస పోతున్న నేతలంతా ఆయారామ్ గయారామ్లని పేర్కొన్నారు. వారంతా తొలుత తెలుగుదేశం పార్టీ తరపున గెలిచారని, ఇప్పుడు వాళ్లకు అమ్ముడుపోతున్నారని, ఇది చూస్తే చాలా బాధేస్తోందన్నారు. పార్టీ గుర్తుతో గెలిచి ఫిరాయిస్తే సభ్యత్వం రద్దవుతుందని, కాంగ్రెస్ పార్టీ ఆ అవకాశం లేకుండా చేస్తూ బరితెగించి పరోక్ష ఎన్నికలకు శ్రీకారం చుడుతోందని ధ్వజమెత్తారు.
త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా అదే పద్ధతిన నిర్వహించాలని యోచిస్తోందని ఆరోపించారు. మొండిచెయ్యితో నేరుగా ప్రజల వద్దకు వెళితే విరగ్గొడతారని తెలిసి దొంగ ముసుగేసుకొని వస్తోందన్నారు. సహకార ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు, తెరాస గల్లంతు అయ్యాయని, టిడిపి గెలిచే స్థానాల్లో స్టేలతో కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడిందన్నారు. అందరూ కలిసి హస్తాన్ని చితక్కొట్టి నామరూపాలు లేకుండా చేయాలని పిలుపునిచ్చారు.