ప్రభాకరన్ కొడుకు హత్య: కాళిలా మారిన జయలలిత!
బ్రిటిష్ టివి ప్రసారం చేసిన ఈ డాక్యుమెంటరీ పైన ప్రపంచవ్యాప్తంగా శ్రీలంక ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. ఇతర దేశాలతో కలిసి మన కేంద్ర ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వ దమననీతిని అంతర్జాతీయ కోర్టుకు తీసుకు వెళ్లాలని సూచించారు. ఇది అమానవీయ చర్య అన్నారు. ప్రభాకరన్ తనయుడు చిన్నవాడు అని, బాలుడిని కర్కశంగా చంపడమేమిటన్నారు. ఈ చర్య పైన మానవ హక్కుల సంఘాలు, ఆమ్నెస్టీ తదితర సంస్థలు కూడా ఖండించాయి.
ప్రభాకరన్ తనయుడు బాలచంద్రన్ను తాము కిరాతకంగా హతమార్చామనే ఆరోపణలు అవాస్తవమని శ్రీలంక ప్రభుత్వం ఖండించింది.
కాగా, ఎల్టిటిఇ అధినేత ప్రభాకరన్ మరణం తర్వాత చాలా కాలానికి అత్యంత ఆశ్చర్యానికి, గగుర్పాటుకు గురి చేసే కొన్ని చిత్రాలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రీలంక సైన్యం కిరాతకాన్ని చూపించే దారుణమైన చిత్రాలు వెలుగు చూశాయి. ప్రభాకరన్ 12 ఏళ్ల కుమారుడు బాలచంద్రన్ను శ్రీలంక సైన్యం పట్టుకుని అత్యంత దారుణంగా హింసించి చంపిన తీరుకు అద్దం పట్టే ఫోటోలు బయటకు వచ్చాయి.
బాలచంద్రన్కు సంబంధించిన కొన్ని ఛాయాచిత్రాలను చానెల్ 4 మరోసారి ప్రచురించింది. ఇసుక సంచులు నింపిన టెంట్ కింద శ్రీలంక సైన్యం ఆపరేట్ చేసిన బాలచంద్రన్ కూర్చున్న ఛాయాచిత్రాలను ఆ చానెల్ ప్రచురించింది. అంతకు ముందు ఇదే చానెల్ బాలుడి శరీరంపై బుల్లెట్ తూటాల తూట్లు గల చిత్రాలతో కూడిన వీడియోను ప్రసారం చేసింది. మృతి చెందిన పడి ఉన్న అంగరక్షకుల మధ్య పడి ఉన్న బాలచంద్రన్ను ఆ చానెల్ చూపించింది.
బాలచంద్రన్ ఎదురు కాల్పుల్లో మరణించాడని శ్రీలంక సైన్యం ప్రకటిస్తూ వస్తోంది. ప్రస్తుత ఛాయాచిత్రాలతో శ్రీలంక సైన్యం ప్రవర్తనను, వ్యవహార శైలిని బయటపెడుతోంది. బంకర్లో కూర్చున్న బాలచంద్రన్ను శ్రీలంక ఆర్మీ పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2009లో ఎల్టిటిఇని అంతం చేయడానికి శ్రీలంక ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా ఈ చిత్రాలను తీశారు. బాలచంద్రన్ ఎదురు కాల్పుల్లో చనిపోలేదని చెప్పడానికి ఈ ఫొటోలు చక్కటి ఉదాహరణలని అంటున్నారు.