ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఔటర్‌లో ప్రమాదం: స్నానం చేస్తుండగా సెల్‌లో చిత్రీకరణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Four dead in Outer accident
హైదరాబాద్/ఖమ్మం: రంగారెడ్డి జిల్లా నార్సింగి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. ఈ రోజు ఉదయం నార్సింగి మంచిరేవుల వద్ద ఓ వాహనం ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కూలీలుగా తెలుస్తోంది. రోడ్డుపై పనులు చేస్తున్న వారి పైకి వాహనం దూసుకు రావడంతో వారు మృతి చెందారు.

మృతి చెందిన కార్మికులలో ముగ్గురు మహిళలు, ఓ వృద్ధుడు ఉన్నారు. వీరు నల్గొండ జిల్లాకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను హైదరాబాదులోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. ఔటర్ రింగు రోడ్డులో ఇలా తరుచూ ప్రమాదాలు జరుగుతుండటం ఆందోళనను కలిగిస్తోంది.

స్నానం చేస్తుండగా సెల్‌లో..

ఖమ్మం జిల్లాలో ఓ యువకుడు ఓ బాలిక స్నానం చేస్తుండగా సెల్ ఫోన్‌లో చిత్రీకరించి పట్టుబడ్డాడు. జిల్లాలోని ఇల్లెందు బిసి హాస్టల్‌లో ఉంటున్న ఓ బాలిక స్నానం చేస్తుండగా ఓ యువకుడు సెల్ ఫోన్‌లో చిత్రీకరించాడు. దీనిని గమనించిన స్థానికులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

దొంగలపై కాల్పులు

ప్రకాశం జిల్లాలో డీజిల్ దొంగలపై పోలీసులు కాల్పులు జరిపారు. జరుగుమిల్లి సమీపంలో పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో నిలిపి ఉంచే వాహనాల్లో నుండి డీజిల్ దొంగతనానికి పాల్పడే ముఠాదాడికి యత్నించింది. పోలీసులు వారిపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. ఓ వాహనంలో వారు పరారయ్యారు. పోలీసులు గాలింపు చేపట్టారు.

English summary
Three woman and one Old man died in Outer Ring road accident on Wednesday at Narsingi of Ranga Reddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X