పేలుళ్లు: సైకిళ్లు పాతవే కానీ, ఆర్థిక కేంద్రం దుబాయ్!
సైకిళ్ల విషయంలో ఉగ్రవాదులు చాలా తెలివిగా వ్యవహరించారట. పేలుళ్లకు ఉపయోగించిన సైకిళ్లు పూర్తిగా విడి భాగాలతో రూపొందించినవి. చక్రం, రిమ్ములు, టైర్లు, బాడీలను వేర్వేరుగా సేకరించారు. పాత ఇనుప సామాను నుంచి వాటిని సేకరించి సైకిళ్లుగా మార్చారు. వాటికి కొత్త సీట్లను అమర్చారు. కాబట్టి సైకిళ్లు ఎక్కడ కొనుగోలు చేశారు? ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పడం కష్టమని నిర్ధారించారు. నివేదిక నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు పాత ఇనుప సామాను సేకరించే వారి వివరాలు సేకరిస్తున్నాయి.
కాగా, పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఆర్థిక కేంద్రం దుబాయ్గా అనుమానిస్తున్నారు. భారత గడ్డపై ఉగ్రవాద దాడులు జరిపేందుకు అక్కడి నుండే నిధులు వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాసిన్ భత్కల్ వంటి ఉగ్రవాదుల ఫోన్ కాల్స్ను పరిశీలిస్తే ఇండియన్ ముజాహిద్దీన్ ఆర్థిక కేంద్రం దుబాయ్ కావొచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని ఆధారాలు దొరికాయి: షిండే
పేలుళ్ల దోషులను అతి త్వరలోనే పట్టుకుంటామని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఆదివారం కోల్కతాలో వ్యాఖ్యానించారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు లభించాయని, ఫోరెన్సిక్ ల్యాబ్లో పరిశీలనలు జరుపుతున్నామని, వాటి వివరాలు తెలిసిన వెంటనే దోషులను పట్టుకుంటామని ఆయన తెలిపారు.