వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభియోగాలకు సిబిఐ రెడీ: ఇప్పుడేనా.. జగన్ లాయర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఎమ్మార్ కేసులలో అభియోగాలు నమోదు చేసేందుకు నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు సిబిఐకి అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సిబిఐ త్వరలో ఈ రెండు కేసులకు సంబంధించి అభియోగాలు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాదనల సందర్భంగా జగన్ తరఫు న్యాయవాది అభియోగాల నమోదును తప్పు పట్టారు.

సిబిఐ ఆఖరు ఛార్జీషీటు దాఖలు చేయకుండానే అభియోగాలు ఎలా నమోదు చేస్తుందని జగన్ తరఫు లాయరు ప్రశ్నించారు. ఛార్జీషీట్లు పూర్తి కాకుండా అభియోగాలు నమోదు చేసే అధికారం కోర్టుకు లేదని వాదించారు. వాదనల అనంతరం మాత్రం అభియోగాలు నమోదు చేసేందురు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.

మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం మంత్రి ధర్మాన ప్రసాద రావు బుధవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. జగన్, ఓఎంసి, ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా ఏఐఎస్ అధికారులు మన్మోహన్, శామ్యూల్‌తో పాటు కోనేరు ప్రసాద్, బిపి ఆచార్య, అయోద్య రామిరెడ్డి, రాజగోపాల్, విజయ సాయి రెడ్డిలు కోర్టుకు హాజరయ్యారు. వీరికి మార్చి 13వ తేది వరకు కోర్టు రిమాండును పొడిగించింది.

జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ బుధవారం సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణను మార్చి 1వ తేదికి వాయిదా వేసింది.

English summary
It is said that YSR Congress Party chief YS Jaganmohan Reddy's lawyer opposed charges in Jagan's DA case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X