వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు నిరాశ: ఉన్నది కూడా పోయింది

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి నిరాశనే మిగిల్చాయి. ఈ నియోజకవర్గాల్లో గతంలో ఒక సీటును గెలిచిన తెలుగుదేశం పార్టీ ఈసారి దాన్నీ పోగొట్టుకొంది. గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటులో తెలుగుదేశం పార్టీ చిగురుపాటి వరప్రసాద్ గెలుపొందారు. ఈసారీ తెలుగుదేశం పార్టీ ఆయనకే అవకాశమిచ్చింది. ఆయన ఓడిపోయారు.

సహకార ఎన్నికల్లో ఈ రెండు జిల్లాలో టిడిపి మెజారిటీ సొసైటీలు గెలుచుకుని ఉత్సాహంగా ఉంది. అయితే, ఆ ఉత్సాహాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం నీరు గార్చింది. అతి ధీమాతోనే గెలిచే సీటును పోగొట్టుకొన్నామనే అభిప్రాయం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. వర ప్రసాద్ సొంతంగా తిరగడం తప్ప పార్టీ నేతలు ఎవరూ ఆయన ఎన్నికను పట్టించుకోకపోవడం కూడా అపజయానికి మరో కారణమని అంటున్నారు.

పోలింగ్‌కు సరిగ్గా నాలుగు రోజుల ముందు చంద్రబాబు స్వయంగా జోక్యం చేసుకొన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని అంటున్నారు. పార్టీ అంతర్గత కారణాలు కూడా ఈ ఓటమికి కారణమయ్యాయని వినిపిస్తోంది. వరప్రసాద్ సంఘసేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చి పార్టీపరమైన కార్యక్రమాలను విస్మరించడంతో నాయకులు ఆయనను పట్టించుకోలేదనే కూడా ఉంది.

నిజానికి, గుంటూరు జిల్లా నేతలు ఈ సీటుకు మరో అభ్యర్థిని సూచించారు. అతనికి సీటు దక్కకపోవడంతో వారు సహాయ నిరాకరణ చేశారని భావిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉండి వాటి ఆధారంగా బలమైన ఓటు బ్యాంకు ఉంటేనే ఈ ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని అంటున్నారు.

English summary
Telugudesam party has lost its sitting MLC seat of Krishna and Guntur graduate constituency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X