బ్రదర్ అనిల్ సంగతేమిటి: అగస్టా స్కామ్పై టిడిపి ప్రశ్న
దేశంలో ఏ కుంభకోణం వెలుగుచూసినా దాని మూ లాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాయని సీఎం రమేశ్ విమర్శించారు. ఎమార్-ఎంజీఎఫ్ డైరెక్టర్ హష్కే ప్రారంభించిన ట్రస్టుకు వైయస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 800 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించిందని, ఆ ట్రస్టుకు వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కుమార్ ట్రస్టీగా ఉన్నారని వెల్లడించారు.
దేశంలో అగస్టా హెలికాప్టర్ను ముందుగా కొనుగోలు చేసింది వైయస్ హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేనని, ఆ హెలికాప్టర్ ఈ మధ్యనే కాలిపోయిందని అంటూ ఈ వ్యవహారంపైనా సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వైయస్ హయాంలోనే ఈ కుంభకోణానికి అంకురార్పణ జరిగిందని దేవేందర్గౌడ్ ఆరోపించారు. అప్పుడు సభలో ఉన్న కాంగ్రెస్ సభ్యులు కెవిపి రామచంద్రరావు, ఎం.ఎ.ఖాన్ ఆయన వ్యాఖ్యలను ఖండించారు. అగస్టా హెలికాప్టర్ల కుంభకోణంపై విచారణను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి)కి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.