వ్యక్తిగత పన్ను మినహాయింపు పరిమితి పెంపు
ప్రత్యక్ష పన్నుల్లో మార్పు లేదని చిదంబరం చెప్పారు. వార్షికాదాయం రూ. 2.20 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు పన్నుల పరిధిలోకి రారు. రూ. 5 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్నవారికి రూ. 2 వేల పన్ను ఆదా అవుతుంది. స్థిరాస్తి అమ్మకంపై 2 శాతం టిడిఎస్ విధించనున్నట్లు, వ్యవసాయ భూమి అమ్మకాన్ని దీని నుంచి మినహాయిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
జిడిపిలో ప్రత్యక్ష పన్నులు 5.5 శాతం ఉండగా, పరోక్ష పన్నులు 4.4 శాతం ఉన్నట్లు తెలిపారు. పన్ను స్లాబ్ల్లో మార్పు లేదని చెప్పారు. ప్రణాళికేతర వ్యయం 11,09,975గా అంచనా వేశారు. రెవెన్యూ లోటును 3.3 శాతానికి కుదించారు. 2013 -14కు ద్రవ్యలోటు అంచనా 4.8 శాతం ఉంది.
సెబీని మరింత బలోపేతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. దీనికోసం చట్టసవరణ తీసుకుని వస్తామని చెప్పారు. స్త్రీలకు భద్రతకు పెద్ద పీట వేస్తామని మంత్రి చెప్పారు. మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. వేయి కోట్ల రూపాయలతో నిర్భయ ఫండ్ను నెలకొల్పుతున్నట్లు తెలిపారు.