వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దోశ అంటే పిండిలా రుబ్బేస్తారు: వాయలార్‌కు కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ మహిళలు తల్చుకుంటే కాంగ్రెసు పార్టీని దోశ పిండిలా రుబ్బుతారని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెసు నేతలు అవమానపరుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మతిభ్రమించి ఉద్యమాన్ని కించపర్చేలా మాట్లాడటం సరికాదన్నారు.

తెలంగాణ ఇస్తే ఇవ్వాలని ఉంటే ఇవ్వండని అంతేకాని దోశ, వడ అంటూ మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణపై పరిష్కారం దోశ వేసినంత సులువు కాదని కేంద్రమంత్రి వాయలార్ చెప్పడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. ఆయనకు అలా మాట్లాడటానికి తెలివి ఉండాలన్నారు. ఆయనవి పలుపు మాటలని నిప్పులు చెరిగారు. కాంగ్రెసు నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు.

తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలకు ఏమాత్రం పౌరుషం లేదన్నారు. తాము తెలంగాణను యాచించేది లేదని శాసించి తెచ్చుకుంటామన్నారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు ఉద్యమంలో కలిసి రాకపోవడం వల్లనే ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను తెలంగాణ ఇవ్వమని అడగగలమే కాని బడితె పట్టుకొని కొట్టలేమన్నారు.

తెలంగాణ కాంగ్రెసు నేతలు సన్నాసులని, వాయలార్ వ్యాఖ్యలపై వారు ఎందుకు స్పందించడం లేదన్నారు. ఆర్టీసిలో మహిళ పోస్టులను వారికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతానికి ఆర్టీసి నియామకాల్లో అన్యాయం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగితే కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని చెప్పారు.

English summary
Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao has condemned central minister Vayalar Ravi comments on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X