ఐబి హెచ్చరిక: ఐమాక్స్, లుంబినీ ప్రాంతంలో తనిఖీలు
దీంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల అనంతరం రాజధానిలో ఏదో ఒక పక్క బాంబు ఉందంటూ ఫోన్లు రావడం, నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో పోలీసు వర్గాలు అప్రమత్తమయ్యాయి. లుంబినీ పార్క్లో పోలీసులు తనిఖీలు జరిపారు. ఐమాక్స్ వద్ద ఆక్టోపస్ సోదాలు చేసింది. వనస్థలిపురంలో పోలీసులు తనిఖీల్లో రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ పోలీసులు బుధవారం ఉదయం తనిఖీలు నిర్వహించారు. రాష్ట్రంలో ఉగ్రవాదుల దాడులు జరుగవచ్చనే ఐబీ హెచ్చరికల నేపథ్యంలో ఈ దాడులు జరుగుతున్నాయి. అటు లుంబినీ పార్కులోనూ పోలీసులు తనిఖీలు జరుపుతున్నారు.
నిజామాబాద్ - కాచిగూడ ప్యాసింజర్ రైలులో బాంబు ఉన్నట్లు కలకలం చెలరేగింది. దీంతో బాంబు స్వ్కాడ్ అక్కడకు నిజామాబాద్ రైల్వే స్టేషన్లో రైలును నిలిపి క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు లేదని తేలడంతో ప్రయాణీకులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో వదిలి వెళ్లిన రేడియోను చూసి ప్రయాణీకులు బాంబుగా భావించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం సదాశివనగర్ మండలం ఉప్పలవాయి రైల్వే స్టేషన్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.