కేసులపై ఒత్తిడి, ప్రోద్భలం లేదు: సిబిఐ లక్ష్మీనారాయణ
తన విధి నిర్వహణను తాను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని చెప్పారు. సిబిఐ కేసులు ఎవ్వరి ప్రోద్బలంతో జరగడం లేదని, పారదర్శకంగా పని చేస్తోందన్నారు. యువత సిబిఐలో ఉద్యోగాలు సంపాదించవచ్చని, కానిస్టేబుళ్లు, సబ్ ఇన్స్పెక్టర్లు కూడా సిబిఐలోకి రావొచ్చని చెప్పారు. నేడు దేశంలో జరుగుతున్న వివిధ రకాల నేరాలకు సంబంధించి ఆయా రంగాల్లో నిష్ణాతులైన సాంకేతిక నిపుణుల సాయంతో నేర పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు.
పలు కేసులలో సాంకేతిక నిపుణుల ఆవశ్యకత వుంటుందని, వారి ద్వారా వివిధ రంగాలకు సంబంధించిన కేసులను త్వరగా ఛేదించడం జరుగుతుందని చెప్పారు. ఆర్థిక నేరాలకు సంబంధించి పలువురు బ్యాంకర్లు, చార్టర్డ్ అకౌంటెంట్ల వంటి నిపుణులు కేసుల పరిశోధనలో సిబిఐ టీంతో సహకరిస్తుంటారని చెప్పారు.
నైజీరియన్ క్రైమ్లు పెరిగాయని, ఈమెయిల్, సెల్ఫోన్లలో లక్షల డాలర్ల బహుమతులు వచ్చాయంటూ మెసేజ్లు పంపించి వారి బ్యాంకు అకౌంట్లు, తదితర విషయాలను తెలుసుకుని ప్రజలను మోసగిస్తున్నారని, ఎవ్వరూ మోసపోవద్దని, సంబంధిత పోలీసులకు, సిబిఐ వారికి ఫిర్యాదు చేయాలని ఆయన చెప్పారు.