ఐక్యూలో ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలిక నేహా
గత అక్టోబర్లో ఒలీవియా మానింగ్ అనే బాలిక 162 ఐక్యూతో మేధావుల క్లబ్ మెన్సాలో చోటు సాధించింది. తాజాగా బ్రిటన్లో ఉంటున్న నేహారాము ఈ ఘనత సాధించింది. నేహా తల్లిదండ్రులు మునిరాజు, జయశ్రీ ఇద్దరూ కంటి వైద్యులే. యుకెలోని మెన్స్ నిర్వహించే ఐఐఐబి పరీక్షలో ఆమె ఈ స్కోరు సాధించింది. నేహా ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఆమె తల్లిదండ్రులు కింగ్ స్టన్కు వలస వెళ్లారు.
నేహా సాధించిన విజయంతో ఆమె తల్లిదండ్రులు ఆనందపడుతున్నారు. నేహాను చూసి తాము గర్వపడుతున్నామని, ఈ సంతోషం మాటల్లో చెప్పలేమంటున్నారు. ఆమె మేధస్సును తల్లిదండ్రులు మొదట్లో గుర్తించలేదు. ఓ పరీక్షలో ఆమె 280కి 280 మార్కులు సాధించింది. అప్పటి నుండి తల్లిదండ్రులు ఆమె మేధస్సుపై దృష్టి సారించారు. హారీపోటర్ వీరాభిమాని అయిన నేహాకు ఈత కొట్టడం సరదా.
మెన్స్ పరీక్ష చాలా కష్టమని, అందులో అంత స్కోరు సాధిస్తానని తాను ఊహించలేదని, సోమవారం ఫలితాలు చూసి ఆశ్చర్యపోయానని, సంతోషంగా ఉందని నేహా రాము అన్నారు. కాగా, ఐన్ స్టీన్ తన జీవిత కాలంలో ఎప్పుడూ ఇలాంటి మేధో స్థాయి పరీక్షలు ఎదుర్కోలేదు. అయితే ఆయన మేధోస్థాయి 160 వరకు ఉంటుందనేది అంచనా మాత్రమే.