పిల్ల కాకి: లోకేష్కి కౌంటర్, ట్విట్టర్ చాలని వంశీ సవాల్
తండ్రి చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ ఇద్దరు పిట్టల దొరల్లా మారిపోయారని ఎద్దేవా చేశారు. లోకేష్వి అపరిపక్వ, అసందర్భమైన వ్యాఖ్యలన్నారు. వాస్తవ దూరమైన విమర్శలు ఇప్పటికైనా మానుకోవాలని సూచించారు. లేదంటే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. టిడిపికి మరోసారి షాక్ ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. లోకేష్ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకుంటా నోటిని కట్టిపెట్టలని సూచించారు.
లోకేష్కు వంశీ సవాల్
తెలుగుదేశం పార్టీ పాలన, కాంగ్రెసు పాలన పైన తాము బహిరంగ చర్చకు సిద్దమని కాంగ్రెసు పార్టీ యువజన అధ్యక్షుడు వంశీ చంద్ రెడ్డి సవాల్ విసిరారు. లోకేష్ ట్విట్టర్కే పరిమితం కావాలన్నారు. ఎక్కువ మాట్లాడితే ఆయన రాజకీయ అజ్ఞానం బయటపడుతుందని హితవు పలికారు.
కాగా, మూడు రోజుల పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లిన నారా లోకేష్ అధికార కాంగ్రెసు పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని విమర్శించిన విషయం తెలిసిందే. గురువారం కుప్పం వెళ్లిన లోకేష్ రేపటి వరకు అక్కడే ఉంటారు. కార్యకర్తలతో సమావేశమై పార్టీ బలోపేతంపై చర్చిస్తున్నారు.