'వైయస్కు గాలి జనార్ధన్ రూ.500 కోట్లు బహుమతి'
తాను వైయస్కు రూ.500 కోట్లు బహుమతిగా ఇచ్చినట్లు గాలి సిబిఐ విచారణలో అంగీకరించినట్లుగా ఆ పత్రికలో వచ్చిందన్నారు. గాలి ఇచ్చిన డబ్బును వైయస్ 2009లో ఎన్నికల ఖర్చు కోసం వినియోగించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధుల ఖర్చును కూడా 2009లో గాలియే భరించారని, దీనిని ఆయనే స్వయంగా అంగీకరించినట్లుగా వార్తలొచ్చాయన్నారు.
ప్రజాస్వామ్య మూలాలకు విఘాతం కలిగించే ఈ ఘటనపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ అక్రమ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఎన్నికల సంఘానికి తాను లేఖ రాస్తానని చెప్పారు. సిబిఐకి గాలి ఇచ్చిన వాంగ్మూలం రెండు మూడు రోజుల్లో కోర్టు ముందుకు వస్తుందన్నారు. వైయస్ తనకు చేసిన ఉపకారానికే గాలి అంత పెద్ద మొత్తంలో ఆయనకు డబ్బు ఇచ్చారన్నారు.
కెసిఆర్, జగన్ ప్రమాణం చేయాలి
అవిశ్వాసం పెడతామని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, అవిశ్వాసంపై సవాల్ విసురుతున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ముఖ్య నేతలు తమ పార్టీలను కాంగ్రెసులో కలపమని ప్రమాణం చేయాలని టిడిపి సీనియర్ నేత రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. భవిష్యత్తులో తెరాసను కాంగ్రెసులో కలపమని కెసిఆర్.. ఆచార్య జయశంకర్, తెలంగాణ తల్లి పైన ప్రమాణం చేయాలని, జగన్, విజయమ్మ, షర్మిలలు వైయస్ సమాధి పైన ప్రమాణం చేయాలని సవాల్ చేశారు.