మల్కాజ్గిరిపై 'లోకల్' చిచ్చు: మైనంపల్లి X దేవేందర్

దీనిని దేవేందర్ గౌడ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మైనంపల్లి సోమవారం దేవేందర్ గౌడ్ పైన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లాలో స్థానికేతరులకు టిక్కెట్లు ఇవ్వబోమని రెండు రో జుల కిందట దేవేందర్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మాట అనేందుకు ఆయన ఎవరని, ఈ మాటకు వస్తే తానే లోకల్ అని, ఆయనే నాన్ లోకల్ అన్నారు. దేవేందర్ గౌడ్కు రంగారెడ్డి జిల్లాతో సంబంధం ఏమిటని ప్రశ్నించారు.
దేవేందర్ గౌడ్ నగరంలోని పాత బస్తీకి చెందిన వారని ఆయన రంగారెడ్డి జిల్లాలో ఎలా పెత్తనం చేస్తారన్నారు. ఏ అర్హత ఉందని ఆయన మేడ్చల్లో పోటీ చేశారని ప్రశ్నించారు. ఇపుడు ఏ అర్హత ఉందని తన కుమారుడిని ఉప్పల్ నుంచి పోటీకి నిలబెట్టాలనుకుంటున్నారో చెప్పాలన్నారు. పదవులన్నీ ఆయనకు, ఆయన కుటుంబీకులకేనా అని ధ్వజమెత్తారు. తాను స్థానికుడ్ని కనుకే మల్కాజిగిరి టిక్కెట్ ఆశిస్తున్నానని, పార్టీ నిర్ణయం మేరకే నడుచుకుంటానని చెప్పారు.
నియోజకవర్గంలోని అల్వాల్ తాను పుట్టి పెరిగిన ప్రాంతమని, ప్రస్తుతం కూడా ఇక్కడే ఉంటున్నానని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చని, ఈ విషయం సీనియర్ నేత దేవేందర్ గౌడ్కు తెలియకపోవడం విచారకరమన్నారు. టిడిపి వల్ల రాజకీయంగా ఎదిగిన దేవేందర్ పార్టీకే వెన్నుపోటు పొడిచారని ఎన్టీఆర్, చంద్రబాబుపై కూడా తీవ్ర విమర్శలు చేశారని చెప్పారు.
గత ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడానికి ఆయనే కారణమన్నారు. కొందరిని ఆయన అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బిసి కార్డుతో పార్టీలో ఎదిగిన దేవేందర్ బిసిలకు చేసిందేమీ లేదన్నారు. క్షమాభిక్ష పెడితే తిరిగి పార్టీలోకి వచ్చారని, ఆయన కొన్నాళ్లు పార్టీ కోసం శ్రమించి తన పనితనాన్ని రుజువు చేసుకోవాలన్నారు. అలా కాకుండా పార్టీలో గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, గతంలో ఆయన టిడిపిని వీడి కొత్త పార్టీ పెట్టినప్పుడు తన వెంట రానివారిని ఇప్పుడు టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
రెండు రోజుల క్రితం దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలో నాయకులకు కొదవ లేదని వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ స్థానికులే పోటీ చేస్తారని బయట వారికి ఎలాంటి అవకాశం కల్పించబోమని స్పష్టం చేశారు.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications