టిడిపి మహిళా నేత కుమార్తె ప్రేమ వివాహం
ఎంబిఏ చదువుతున్న మాధురిని కళాశాలకు తీసుకు వెళ్తున్న క్రమంగా ఇద్దరి మధ్య పెరిగిన సాన్నిహిత్యం ప్రేమకు దారి తీసింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న వారు కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. దళిత నేతల సమక్షంలో ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.
అనంతరం మాధురి మాట్లాడుతూ... తమ పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించరనే ఉద్దేశ్యంతోనే ఇక్కడకు వచ్చి పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి డిఎస్పీ లక్ష్మీ నారాయణష ఎస్సై రాజేంద్రప్రసాద్ అలయానికి వెళ్లి, దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు.
మాధురి తప్పిపోయిందని ఫిర్యాదు
తమ కుమార్తె బుధవారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదని కవిత భర్త, మాధురి తండ్రి దశరథ్ రాజ్ గురువారం హైదరాబాదులోని పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ఇంటికి సమీపంలో ఉన్న బంగారం తాకట్టు దుకాణంలో తన ఆభరణాలు తాకట్టు పెట్టి రూ.83 వేలు తీసుకున్న మాధురి, తన కారును అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.