షిండేకు ఆ అర్హత: కావూరి, జారిపోతారని..: కనుమూరి
షిండేకు ప్రధాని కాగల అర్హత ఉందన్నారు. మన రాష్ట్రం అంటే షిండేకు ప్రత్యేక అభిమానం అన్నారు. ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన మన రాష్ట్రానికి గవర్నర్గా పని చేసిన అనుభవం ఉందన్నారు. ఆయనకు ఆంధ్రప్రదేశ్ అంటే ఎనలేని అభిమానం అన్నారు. ఈ ఒక్క కార్యక్రమం కోసం ఆయన రావడంతోనే ఆయనకు ఎపి పట్ల ఉన్న అభిమానం తెలుస్తోందన్నారు. పేద కుటుంబంలో పుట్టిన షిండే కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు.
కావూరి జారిపోతారనుకున్నారు....
ఏలూరు పార్లమెంటు సభ్యులు కావూరి సాంబశివ రావు జారిపోతారని గతంలో ప్రచారం జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు అన్నారు.
హైలెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన అనంతరం షిండే మాట్లాడారు. జాతీయ విపత్తుల నివారణకు కేంద్ర ప్రభుత్వం మూడు దశలుగా ప్రపంచ బ్యాంకు సహాయంతో తీర ప్రాంత రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోందని చెప్పారు. మొదటి దశలో రూ.15వందల కోట్లతో ఆంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో రహదారులు, వంతెనల నిర్మాణం, ప్రజలను అప్రమత్తం చేసేందుకు శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. రెండో దశలోని ఎపికి అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.