హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లు: సమాచారమిస్తే రూ.10 లక్షలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Dilshukhnagar Blasts
హైదరాబాద్: దిల్‌సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు సంబంధించి కీలక సమాచారం తెలిపిన వారికి నగదు రివార్డును ప్రకటించారు. ఈ బాంబు పేలుళ్ల కేసును ఎన్ఐఏ(జాతీయ దర్యాఫ్తు సంస్థ) విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. బాంబు పేలుళ్లకు సంబంధించి సమాచారం ఇచ్చిన వారికి రూ.10 లక్షల రివార్డును అందిస్తామని ఎన్ఐఏ తెలిపింది. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపింది.

కాగా, దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల కేసులో నిందితుడు ఎవరనేది తెలిసిందని రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) దినేష్ రెడ్డి మూడు రోజుల క్రితం చెప్పిన విషయం తెలిసిందే. సిసిటివీ ఫుటేజ్ ద్వారా నిందితుడు ఎవరనేది తెలిసిందని, అతను ఎక్కడున్నాడో కనిపెట్టాల్సి ఉందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. దిల్‌షుక్‌నగర్ బాంబు పేలుళ్ల కేసులో ఒక వర్గం వారినే తాము అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామనే విమర్శలో నిజం లేదని ఆయన అన్నారు.

పేలుళ్లకు కారణం ముస్లిం జిహాదీ గ్రూపులా, హిందూ అతివాద సంస్థలా అనేది ఇంకా గుర్తించలేదని ఆయన చెప్పారు. అనుమానం ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఆయన అన్నారు. ఇందులో ఒక వర్గంవారినే లక్ష్యం చేసుకున్నామనే వాదన సరి కాదని ఆయన అన్నారు.

అన్ని కోణాల నుంచి కేసు దర్యాప్తు సాగుతోందని ఆయన చెప్పారు. కేసు దర్యాప్తు చురుగ్గా సాగుతోందని అన్నారు. నిందితుడిని పోలీసులు గాలిస్తున్నారని ఆయన చెప్పారు. పేలుళ్ల కేసులో ముస్లిం అమాయక యువకులను వేధిస్తున్నారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించిన విషయం తెలిసిందే.

English summary
National Investigation Agency has announced Rs.10 lack reward in Dilsukhnagar bomb blasts case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X