దిల్షుక్నగర్ పేలుళ్లు: ఇక్కడ పుట్టి, అక్కడికి వెళ్లి..?
ఆ పేరు గల వ్యక్తి ఎవరూ తమ వద్ద పనిచేయలేదని వక్ఫ్ బోర్డు చైర్మన్ మౌలానా ఖుస్రూ పాషా, ఇతర అధికారులు అంటున్నారు. అయితే నిఘా సంస్థ పోలీసులు ఆ మాటలను విశ్వసించడం లేదు. అతను అత్యంత ఆశ్చర్యకరమైన రీతిలో కనిపించకుండా పోయాడని, పాకిస్తాన్ గూఢచారిగా పనిచేస్తూ ఉండేవాడు కావచ్చునని భావిస్తున్నారు. కుటుంబాన్ని కూడా సురక్షితంగా పాకిస్తాన్ తీసుకుని వెళ్లాడని చెబుతున్నారు.
వక్ఫ్ బోర్డులో విచారణ జరిపిన తర్వాత హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ ఖలీల్ అహ్మద్ను పోలీసులు బషీర్ గురించి ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తమకు సహకరించాలని పోలీసులు మైనారిటీ కమిషన్ను కోరుతున్నారు. ఖాజీలను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానికుల సహకారం లేకుండా విదేశీ ఉగ్రవాదులు అంత పకడ్బందీగా పేలుళ్లకు పాల్పడి ఉండరని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదులతో చేరిపోయిన బషీర్ కొన్ని నెలలు హైదరాబాదులో ఉన్నాడని, పాకిస్తాన్కు ఫోన్లు చేశాడని భావిస్తున్నారు. ఆ ఫోన్ కాల్స్ తన బంధువులకు చేసినవి కావడంతో అనుమానాలు బలపడుతున్నాయని అంటున్నారు.