సభలోనే ఫోన్తో జయ ఫోటోలు తీసిన ఎంపీ, ఆగ్రహం
ఎంపి ప్రదీప్ తన మొబైల్ ఫోన్తో జయా బచ్చన్ను ఫోటోలు తీశారు. అప్పటికే వివిధ అంశాల పైన సభ అట్టుడికిపోతోంది. శ్రీలంక తమిళుల అంశంపై డిఎంకె, ఏఐడిఎంకె, ములాయం సింగ్ పైన కేంద్రమంత్రి వ్యాఖ్యల పైన సమాజ్ వాది పార్టీ ఎంపీలు రగడ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అధికార పార్టీ ఎంపి ప్రదీప్ జయ ఫోటోలు తీయడం మరింత వేడి రాజేసింది. ప్రదీప్ ఫోటోలు తీస్తున్న విషయాన్ని జయ గుర్తించారు.
తన ఫోటోలు తీసుకుంటున్నారని తోటి ఎంపీలతో చెప్పారు. జయతో పాటు పలువురు ఎంపీలు దీనిని తీవ్రంగా తప్పు పట్టారు. విషయం వివాదాస్పదమవడంతో తన ఫోన్లోని ఫొటోలను తొలగించేందుకు బల్మూచు యత్నించారు. చివరికి కాంగ్రెస్ సభ్యురాలు అంబికా సోనీ సూచనతో జయాబచ్చన్కు బల్మూచు క్షమాపణ చెప్పారు.
బల్మూచు కూడా ఫోన్లోంచి జయా బచ్చన్ ఫోటోలను తీసేశాడు. అయితే మీరు చేసిన పనికి ఏమైనా డబ్బులు చెల్లిస్తారా అంటూ జయ బచ్చన్ గట్టిగా మందలించడంతో చివరికి కాంగ్రెస్ సభ్యులు కలుగజేసుకుని సమస్యకు ముగింపు పలికారు.