ఎమ్మెల్యే జంప్: జైల్లో జగన్ను కల్సిన కూన శ్రీశైలంగౌడ్
కుత్బుల్లాపూర్ నుండి స్వతంత్ర శాసనసభ్యుడుగా గెలుపొందిన కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెసు అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అండతో అప్పుడు శ్రీశైలం గెలుపొందారు. అతను జగన్ వైపు వెళ్తారని మొదటి నుండి ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అతను జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధపడ్డారు.
వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ మొదటి నుండి జగన్కు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుండి జగన్ వైపు పలువురు నేతలు వెళ్తున్నా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు సీమాంధ్ర నుండే వెళ్లారు. ఒక్క సురేఖ తప్ప. తెలంగాణ ప్రాంతం కొండా సురేఖ తర్వాత ఎమ్మెల్యేలు వెళ్లలేదు. ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్ వెళ్లారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే వెళ్తారనే ప్రచారం సాగింది.
మరోవైపు జగన్ పార్టీలోకి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మువ్వా ఆనంద్ శ్రీనివాస్ వచ్చారు.