వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే జంప్: జైల్లో జగన్‌ను కల్సిన కూన శ్రీశైలంగౌడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kuna Srisailam Goud
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కలిశారు. శుక్రవారం ఉదయం ములాకత్ సమయంలో శ్రీశైలం గౌడ్ జగన్‌ను కలిశారు. పార్టీలో ఎప్పుడు చేరాలనే అంశంతో పాటు టిక్కెట్ తదితర వాటిపై మాట్లాడినట్లుగా సమాచారం.

కుత్బుల్లాపూర్ నుండి స్వతంత్ర శాసనసభ్యుడుగా గెలుపొందిన కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెసు అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అండతో అప్పుడు శ్రీశైలం గెలుపొందారు. అతను జగన్ వైపు వెళ్తారని మొదటి నుండి ప్రచారం సాగుతోంది. ఇప్పుడు అతను జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధపడ్డారు.

వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ మొదటి నుండి జగన్‌కు మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నుండి జగన్ వైపు పలువురు నేతలు వెళ్తున్నా ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటి వరకు సీమాంధ్ర నుండే వెళ్లారు. ఒక్క సురేఖ తప్ప. తెలంగాణ ప్రాంతం కొండా సురేఖ తర్వాత ఎమ్మెల్యేలు వెళ్లలేదు. ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్ వెళ్లారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే వెళ్తారనే ప్రచారం సాగింది.

మరోవైపు జగన్ పార్టీలోకి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మువ్వా ఆనంద్ శ్రీనివాస్ వచ్చారు.

English summary

 Qutubullapur MLA Kuna Srisailam goud has met YSR Congress Party chief YS Jaganmohan Reddy in Chanchalguda jail on Friday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X