ఢిల్లీకి తప్పిన ఉగ్రవాద ముప్పు, ఇద్దరి అరెస్టు
పోలీసులు గురువారం రాత్రి జమా మసీదు సమీపంలోని ఓ అతిథి గృహంపై దాడి చేశారు. ఉగ్రవాదులుగా అనుమానం ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరు కూడా కాశ్మీరీలను తెలుస్తోంది. వారు ఉంటున్న గది నుంచి పోలీసులు పెద్దయెత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, ఎకె 47 రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరిని అదుపులోకి తీసుకున్న తర్వాత గదిని సీల్ చేశారు. హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన లికాయత్ షా ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. లికాయత్ షాను ఢిల్లీ పోలీసులు రెండు రోజుల క్రితం గోరఖ్పూర్లో అరెస్టు చేశారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాదులు రెక్కీలు నిర్వహించినట్లు చెబుతున్నారు. హోలీ రోజు దాడులకు పాల్పడాలని వారు పథకం వేసుకున్నట్లు తెలుస్తోంది. హోలీ మార్చి 27వ తేదీన ఉంది. గోరఖ్పూర్లో అరెస్టు చేసిన లికాయక్ షాను 15 రోజుల పాటు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.