హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తనను కాదని పెళ్లి చేసుకుందని దాడి: విద్యార్థినిపై రేప్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Girl attacked by youth with knife
విశాఖపట్నం/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఆదివారం దారుణం జరిగింది. ఓ యువతి పైన యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని కందుకూరులో ఓ యువకుడు తనతో నిశ్చితార్థం జరిగిన అమ్మాయి మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నదన్న అక్కసుతో కక్ష పెంచుకొని కత్తితో దాడి చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

భీమిలిలో యువతిపై యాసిడ్

విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలం బోడమట్టిపాలం దగ్గర రామనాయుడుపేటలో పలువురు దుండగులు పదిహేడేళ్ల కాలేజ్ యువతిపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెపై యాసిడ్‌తో దాడి చేశారు. శ్రీకాకుళం జిల్లా నుండి యువతిని కిడ్నాప్ చేసి తీసుకు వచ్చారని అనుమానిస్తున్నారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రస్తుతం విజయనగరం ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. శనివారం సాయంత్రం కళాశాల నుండి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

అనంతలో బిల్డింగు పైనుండి శిశువును పడేసిన వైనం

అనంతపురం జిల్లా గుంతకల్‌లోని ఓ నర్సింగ్ హోంలో ఏడు రోజుల శిశువును బిల్డింగు పై నుండి కింద పడేశారు. నర్సింగ్ హోంకు చెందిన నర్సే ఈ ఘాతుకానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా... తల్లిదండ్రులే మరోసారి ఆడపిల్ల పుట్టిందని కిందపడేశారని సిబ్బంది చెబుతోంది.

భార్యను కొట్టిన భర్త

వరంగల్ జిల్లా మద్దూరు మండలం కొండాపూర్ గ్రామ సమీపంలోని ఓ తండాలు కుటుంబ కలహాల కారణంగా భర్త భార్యను కొట్టాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary
A girl was attacked in Ranga Reddy district with a knife on Sunday morning for rejecting him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X