తనను కాదని పెళ్లి చేసుకుందని దాడి: విద్యార్థినిపై రేప్
భీమిలిలో యువతిపై యాసిడ్
విశాఖపట్నం జిల్లాలోని భీమిలి మండలం బోడమట్టిపాలం దగ్గర రామనాయుడుపేటలో పలువురు దుండగులు పదిహేడేళ్ల కాలేజ్ యువతిపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెపై యాసిడ్తో దాడి చేశారు. శ్రీకాకుళం జిల్లా నుండి యువతిని కిడ్నాప్ చేసి తీసుకు వచ్చారని అనుమానిస్తున్నారు. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రస్తుతం విజయనగరం ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. శనివారం సాయంత్రం కళాశాల నుండి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
అనంతలో బిల్డింగు పైనుండి శిశువును పడేసిన వైనం
అనంతపురం జిల్లా గుంతకల్లోని ఓ నర్సింగ్ హోంలో ఏడు రోజుల శిశువును బిల్డింగు పై నుండి కింద పడేశారు. నర్సింగ్ హోంకు చెందిన నర్సే ఈ ఘాతుకానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా... తల్లిదండ్రులే మరోసారి ఆడపిల్ల పుట్టిందని కిందపడేశారని సిబ్బంది చెబుతోంది.
భార్యను కొట్టిన భర్త
వరంగల్ జిల్లా మద్దూరు మండలం కొండాపూర్ గ్రామ సమీపంలోని ఓ తండాలు కుటుంబ కలహాల కారణంగా భర్త భార్యను కొట్టాడు. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ భార్య మృతి చెందింది. వీరికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.